శ్రీశైలంలో పర్యటించిన కేంద్ర బృందం... కరోనా కేసుల్లేకపోవడంపై సంతృప్తి!

  • కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇద్దరు సభ్యుల బృందం రాక
  • కేంద్ర బృందానికి వివరణ ఇచ్చిన శ్రీశైలం ఆలయ ఈవో
  • పలు సూచనలు చేసిన కేంద్ర బృందం
కేంద్రం నుంచి వచ్చిన ఇద్దరు సభ్యుల బృందం ఇవాళ ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో పర్యటించింది. ఓ వైపు కర్నూలు జిల్లాలో లెక్కకు మిక్కిలిగా కరోనా కేసులు వెల్లడవుతున్నా, శ్రీశైలంలో కరోనా కేసుల్లేకపోవడం పట్ల కేంద్ర బృందం విస్మయం వ్యక్తం చేసింది. శ్రీశైలంలో చేపట్టిన కరోనా నియంత్రణ చర్యలను ఈవో రామారావు కేంద్ర బృందానికి వివరించారు. ఈవో వివరణతో ఆ ఇద్దరు సభ్యులు సంతృప్తి చెందారు. లాక్ డౌన్ తొలగించిన అనంతరం కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. లాక్ డౌన్ ను ఎత్తేశాక పరిమిత సంఖ్యలో దర్శనాలకు అనుమతించాలని అన్నారు.

Srisailam
Central Team
Corona Virus
EO
Andhra Pradesh

More Telugu News